న్యూఢిల్లీ: అంతర్జాతీయ టోర్నీల్లో బరిలోకి దిగి సత్తాచాటుదామనుకుంటున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు కాలం కలిసి రావడం లేదు. గత ఏడాది మార్చిలో టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ టోర్నీలో పోటీపడని నీరజ్కు అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్కు ముందు శిక్షణ, టోర్నీల్లో పాల్గొనేందుకు యూరప్కు బయల్దేరుదామనుకున్న నీరజ్కు ఆదిలోనే ఇబ్బందులు వచ్చి పడ్డాయి. భారత్లో కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఫ్రాన్స్ సహా పలు యూరప్ దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.