న్యూఢిల్లీ: అథ్లెటిక్స్ విభాగంలో భారత్కు తొలి ఒలింపిక్ స్వర్ణం అందించిన నీరజ్ చోప్రా మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఒలింపిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో 10 మ్యాజిక్ మూమెంట్స్లో నీరజ్ ఒలింపిక్ ప్రదర్శన (87.58 మీటర్లు) ఒకటిగా గుర్తింపు దక్కింది. ఈ మేరకు వరల్డ్ అథ్లెటిక్స్ వెబ్సైట్లో నీరజ్ ఘనతకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. ఇక ఒలింపిక్స్కు ముందు దేశ ప్రజలతో పాటు నెటిజన్లకు అంతగా పరిచయం లేని నీరజ్.. టోక్యో స్వర్ణం తర్వాత సోషల్ మీడియాలో సంచలనం అయ్యాడు.