న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్లో స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా భారత త్రివర్ణ పతాకధారిగా వ్యవహరించే అవకాశం కనిపిస్తున్నది. టోక్యో ఒలింపిక్స్లో పసిడి పతకంతో కొత్త చరిత్ర సృష్టించిన నీరజ్.. బర్మింగ్హామ్ కామన్వెల్త్ ప్రారంభ కార్యక్రమంలో జాతీయ జెండాను చేతబూని జట్టుకు సారథ్యం వహించే చాన్స్ ఉంది.
‘కామన్వెల్త్ ప్రారంభోత్సవానికి నీరజ్ చోప్రా అందుబాటులో ఉండే విషయాన్ని పరిశీలిస్తున్నాం’ అని భారత ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) ప్ర ధాన కార్యదర్శి రాజీవ్ మెహతా పేర్కొన్నాడు. జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరిగే కామన్వెల్త్ గేమ్స్లో భారత్ ఈసారి 322 మంది సభ్యుల భారీ బృందంతో బరిలోకి దిగనుంది.