మెడెలిన్ : ఆర్చరీ ప్రపంచకప్లో తెలుగమ్మాయి జ్యోతి సురేఖతో కూడిన భారత బృందం కాంపౌండ్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకుంది. అదితి స్వామి, జ్యోతి సురేఖ, పర్నీత్ కౌర్తో కూడిన భారత జట్టు టైబ్రేక్లో మెక్సికోను ఓడించింది. ఇరు జట్లు 232 పాయింట్లతో సమంగా నిలవడంతో టైబ్రేక్ అమలు చేశారు.
టైబ్రేక్లో భారత బృందం పైచేయి సాధించి పతకం దక్కించుకుంది. భారత పురుషుల కాంపౌండ్ బృందం కూడా కొలంబియాపై నెగ్గి కాంస్య పతకం గెలుచుకుంది.