భువనేశ్వర్: ఒడిశాలో పురుషుల హాకీ వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రూర్కెలాలో బిర్సా ముండా హాకీ స్టేడియం కాంప్లెక్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం పట్నాయక్ మాట్లాడుతూ.. ఒకవేళ ఇండియా జట్టు హాకీ వరల్డ్కప్ గెలిస్తే, అప్పుడు ప్లేయర్లకు ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇస్తామని ప్రకటించారు. జాతీయ పురుషుల హాకీ జట్టుతో నవీన్ పట్నాయక్ ముచ్చటించారు. టీమిండియాకు బెస్ట్ విషెస్ తెలిపారు. ఇండియా జట్టు చాంపియన్గా అవతరిస్తుందని పట్నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు.