హైదరాబాద్: తెలంగాణలో జాతీయ యూత్ గేమ్స్ నిర్వహించాలంటూ భారత ఒలింపిక్ సమాఖ్య(ఐవోఏ) అధ్యక్షుడు అనిల్ ఖన్నాను రాష్ట్ర క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. వచ్చే నెలలో ఐవోఏ ప్రతినిధుల బృందం తెలంగాణలో పర్యటిస్తుందని మంత్రి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నాం. క్రీడా మైదానాలు, మౌలిక సదుపాయాలు, వసతులు కల్పిస్తున్నాం. ప్రతీ నియోజకవర్గంలో స్టేడియాలు నిర్మిస్తున్నాం. రాష్ర్టాన్ని క్రీడా హబ్గా తీర్చిదిద్దేందుకు అత్యుత్తమ పాలసీని తీసుకురాబోతున్నాం’ అని అన్నారు. వివిధ జాతీయ క్రీడా అసోసియేషన్ల అధ్యక్షులు, కార్యదర్శులతో సమావేశం ఏర్పాటులో కీలక భూమిక పోషించిన హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడు జగన్మోహన్రావును మంత్రి అభినందించారు. జాతీయ క్రీడలు జరిపితే జాతీయ హ్యాండ్బాల్ అసోసియేషన్ తరఫున పూర్తి సహకారం అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు.