న్యూఢిల్లీ, జూలై 3: ఈ-రిక్షాలు, కొన్ని ఎలక్ట్రికల్ వాహనాలు పనిచేయకుండా ఆపేస్తున్న చైనా యాప్లపై కేంద్రం చర్యలకు దిగింది. తక్షణమే ఏడు అప్లికేషన్లను ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్ స్టోర్ల నుంచి తొలగించాలంటూ గూగుల్, యాపిల్లకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ యాప్లను రిమోట్గా ఉపయోగించి కొందరు ఈ-రిక్షాలు, ఇతర ఎలక్ట్రిక్ వాహనాలను ఆపేస్త్తున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది.
ఈ యాప్ల ద్వారా ఆయా వాహనాల బ్యాటరీలు పనిచేయకుండా ఆపేస్తున్నారని, దీని కారణంగా పలు చోట్ల వాహనాలు ఎక్కడికక్కడ నడిరోడ్లపై నిలిచిపోతున్నాయని వార్తలొచ్చాయి.