హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఢిల్లీ వేదికగా జరుగుతున్న 67వ జాతీయ స్కూల్ గేమ్స్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో రాష్ట్ర స్టార్ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పతకాల వేట దిగ్విజయంగా కొనసాగిస్తున్నది. శుక్రవారం జరిగిన బాలికల అండర్-19 400మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో వ్రితి 4:41:17సెకన్ల టైమింగ్తో పసిడి పతకంతో మెరిసింది.
శిరిణ్, అమృత వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. అదే జోరు కొనసాగిస్తూ 800మీటర్ల ఫ్రీస్టయిల్లో వ్రితి(9:29:01) స్వర్ణం ఖాతాలో వేసుకుంది. బాలుర అండర్-17 200మీటర్ల బ్యాక్స్ట్రోక్ విభాగంలో యువ స్విమ్మర్ సుహాస్ ప్రీతమ్ రజతం దక్కించుకున్నాడు. రెండు స్వర్ణాలు సాధించిన వ్రితిని కోచ్ జాన్ సిద్దిఖి అభినందించాడు.