Telangana | అయిజ, మార్చి 4: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ కేంద్రంలో తిక్క వీరేశ్వరస్వామి బ్రహోత్మవాలను పురస్కరించుకుని జాతీయస్థాయి కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ టోర్నీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా రాష్ర్టాలకు చెందిన 35 మంది మల్లయోధులు పోటీపడ్డారు. ఫైనల్లో కర్ణాటకకు చెందిన రాంచందర్, హైదరాబాద్(తెలంగాణ)కు చెందిన రుద్రేశ్ యాదవ్ ముఖాముఖి తలడ్డారు.
హోరాహోరీగా సాగిన తుది పోరులో రాంచందర్ విజేతగా నిలువగా, రుద్రేశ్ రన్నరప్తో సరిపెట్టుకున్నాడు. వికాస్(హర్యానా), చరణ్, రాంశెట్టి(తెలంగాణ) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. వీరికి ఎస్సై విజయ్భాస్కర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.