హైదరాబాద్: భువనేశ్వర్ వేదికగా జరుగుతున్న 48వ జాతీయ జూనియర్ అక్వాటిక్ చాంపియన్షిప్లో రాష్ట్ర యువ స్విమ్మర్ వ్రితి అగర్వాల్ పసిడి పతక వేట కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన బాలికల 800మీటర్ల ఫ్రీైస్టెల్ రేసులో 9:10:32 సెకన్ల టైమింగ్తో వ్రితి సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో 2014లో మహారాష్ట్ర స్విమ్మర్ ఆకాంక్ష వోహ్రా పేరిట ఉన్న రికార్డు(9:14:04సె)ను వ్రితి తాజాగా అధిగమించింది. ప్రత్యర్థులకు ఆది నుంచే దీటైన పోటీనిస్తూ ముందుకు సాగిన ఈ 15 ఏండ్ల స్విమ్మర్ టోర్నీలో మూడో పసిడి పతకాన్ని ముద్దాడింది. దీంతో వ్రితి ఖాతాలో మూడు స్వర్ణాలు, రజతం, కాంస్యం చేరాయి. మరోవైపు బాలుర 200మీటర్ల బ్యాక్స్ట్రోక్ విభాగంలో సుహాస్ ప్రీతమ్ 2: 15: 01సెకన్లతో స్వర్ణం దక్కించుకోగా,బాలికల కేటగిరీలో నిత్య సాగి(2:27: 58సె) టాప్లో నిలిచింది.