హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్లో జాతీయ సబ్జూనియర్ హ్యాండ్బాల్ పోటీలు జరుగబోతున్నాయి. వచ్చే నెల 7 నుంచి మొదలయ్యే టోర్నీకి సంబంధించిన పోస్టర్ను టూరిజం ప్లాజాలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘హైదరాబాద్ వేదికగా జాతీయస్థాయి టోర్నీ నిర్వహించడం బాగుంది. చాంపియన్షిప్ నిర్వహణకు జాతీయ హ్యాండ్బాల్ అసోసియేషన్(హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు జగన్మోహన్రావు చొరవ తీసుకోవడం అభినందనీయం. మిగిలిన క్రీడా సంఘాలు కూడా రాష్ట్రంలో టోర్నీలు నిర్వహించేందుకు కృషి చేయాలి’ అని అన్నారు. జగన్ మాట్లాడుతూ సరూర్నగర్ ఇండోర్ స్టేడియం, అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగే ఈ జాతీయ టోర్నీలో 26 రాష్ర్టాలకు చెందిన ప్లేయర్లు పాల్గొంటారని తెలిపారు. ప్రారంభ వేడుకలకు క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్, క్రీడా, పర్యాటక మఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథులుగా హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హ్యాండ్బాల్ సంఘం కార్యదర్శి పవన్ తదితరులు పాల్గొన్నారు.