భోపాల్: ప్రపంచ చాంపియన్, తెలంగాణ స్టార్ నిఖత్ జరీన్ ఎలైట్ జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో సెమీస్కు దూసుకెళ్లింది. శనివారం మహిళల 50 కేజీల క్వార్టర్ ఫైనల్లో నిఖత్ ఏకపక్ష విజయం నమోదు చేసుకుంది. తనిష్క (గోవా)తో జరిగిన పోరులో నిఖత్ వరుస పంచ్లతో విరుచుకుపడింది.
తెలంగాణ బాక్సర్ ధాటికి తనిష్క నిలువలేకపోవడంతో రెఫరీ బౌట్ను నిలిపివేసి నిఖత్ను విజేతగా ప్రకటించాడు. సెమీస్లో శిందెర్ కౌర్తో నిఖత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఇతర బౌట్లలో టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహై (75 కేజీలు), మంజురాణి (48 కేజీలు), జ్యోతి (52 కేజీలు), శశి చోప్రా (63 కేజీలు) తమ తమ విభాగాల్లో గెలిచి సెమీఫైనల్స్కు అర్హత సాధించారు.