హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్కు తగిన గుర్తింపు లభించింది. తన సుదీర్ఘ అనుభవంలో ఎంతో మంది అథ్లెట్లను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దిన వరంగల్ వాసి రమేశ్కు జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య(ఏఎఫ్ఐ) ప్లానింగ్ కమిటీలో చోటు దక్కింది. ఈ కమిటీకి లలిత్ భానోత్ చైర్మన్గా వ్యవహరించనున్నారు.