హైదరాబాద్, ఆట ప్రతినిధి : జాతీయ సీనియర్ అక్వాటిక్ చాంపియన్షిప్ టోర్నీకి హైదరాబాద్ వేదిక కాబోతున్నది. గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని స్విమ్మింగ్ పూల్లో జూలై 2 నుంచి పోటీలు మొదలుకానున్నాయి. జాతీయ స్విమ్మింగ్ అసోసియేషన్ సహకారంతో రాష్ట్ర స్విమ్మింగ్ ఆధ్వర్యంలో టోర్నీ జరుగనుంది.
పురుషుల, మహిళల వ్యక్తిగత ఈవెంట్లతో పాటు రిలే ఈవెంట్లు ఆకట్టుకోనున్నాయి. ఈ జాతీయ టోర్నీలో పోటీపడాలనుకునే వారు జూన్ 12 లోగా జీఎమ్ఎస్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉటుంది. ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్కు అధికారిక అర్హత టోర్నీగా జాతీయ చాంపియన్షిప్నకు ప్రపంచ అక్వాటిక్స్ గుర్తింపు ఇచ్చిందని నిర్వాహకులు పేర్కొన్నారు.