కీర్తిపూర్ (నేపాల్): అంతర్జాతీయ టీ20 క్రికెట్లో నమీబియా ప్లేయర్ జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ చరిత్ర సృష్టించాడు. 33 బంతుల్లో సెంచరీ బాది వేగవంతమైన సెంచరీ తన పేరిట రాసుకున్నాడు. మంగళవారం నేపాల్తో జరిగిన పోరులో నికోల్ లాఫ్టీ (36 బంతుల్లో 101; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) విశ్వరూపం కనబర్చాడు.
బౌండ్రీల ద్వారానే 92 పరుగులు సాధించి ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడాడు. ఫలితంగా నమీబియా జట్టు 20 పరుగుల తేడాతో నేపాల్ను చిత్తుచేసింది. గతంలో అంతర్జాతీయ టీ20ల్లో వేగవంతమైన శతకం నేపాల్ ప్లేయర్ కుశాల్ మల్లా (34 బంతుల్లో; మంగోలియాపై) పేరిట ఉంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్ 35 బంతుల్లో సెంచరీలు బాదారు.