దుబాయ్: కనీసం ఒక్క వరల్డ్కప్లోనైనా ఆడాలన్నది ప్రతి క్రికెటర్ కల. కానీ ఈ నమీబియా ప్లేయర్ మాత్రం రెండు వరల్డ్కప్లు ఆడాడు. అది కూడా రెండు వేర్వేరు టీమ్స్ తరఫున కావడం విశేషం. డేవిడ్ వీజ్ అనే ఈ ప్లేయర్ ఈ వరల్డ్కప్లో నమీబియా తరఫున బరిలోకి దిగాడు. నిజానికి ఇతడో సౌతాఫ్రికా ప్లేయర్. 2016 టీ20 వరల్డ్కప్( T20 World Cup )లో ఆ టీమ్ తరఫున ఆడాడు. ఇలా రెండు వరల్డ్కప్లలో రెండు టీమ్స్ తరఫున ఆడిన ప్లేయర్గా డేవిడ్ వీజ్ రికార్డు సృష్టించాడు. సోమవారం శ్రీలంకతో జరిగిన క్వాలిఫయింగ్ మ్యాచ్లో వీజ్.. నమీబియా తరఫున బరిలోకి దిగాడు. కేవలం 6 పరుగులు మాత్రమే చేశాడు.
నిజానికి డేవిడ్ వీజ్ తండ్రి నమీబియాలోనే జన్మించారు. దీంతో అతనికి ఆ దేశం తరఫున కూడా ఆడే అవకాశం లభించింది. ఇప్పటికీ తమ ఫ్యామిలీ ఆ దేశంలో ఉంటున్నట్లు వీజ్ చెప్పాడు. సౌతాఫ్రికా టీమ్కు ఎంపిక కాకముందు కూడా తాను నమీబియా టీమ్తో ఎప్పుడూ టచ్లో ఉండేవాడినని తెలిపాడు. 2013 నుంచి 2016 వరకూ సౌతాఫ్రికా టీమ్లోకి వస్తూ వెళ్తూ ఉన్నాడు. 2021లోనే నమీబియా టీమ్లోకి వచ్చి టీ20 వరల్డ్కప్ టీమ్లో చోటు సంపాదించాడు. ఒకవేళ నమీబియా రెండో రౌండ్లోకి అడుగుపెడితే.. అక్కడ సౌతాఫ్రికా తలపడనుంది.