హైదరాబాద్, ఆట ప్రతినిధి: లక్నోలో జరిగిన ఆరవ జాతీయ క్యాడెట్ అండ్ తైక్వాండోచాంపియన్షిప్లో నాగసాయి ఆరుషి కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లోని తన నివాసంలో ఆరుషిని మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే ప్లేయర్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచేలా కార్యచరణ రూపొందిస్తున్నామన్నారు. క్రీడల్లోనూ తెలంగాణ..మిగతా రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆరుషి తల్లిదండ్రులు పవన్కుమార్, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.