Unofficial Test : మొదటి అనధికారిక టెస్టులో భారత ఏ బౌలర్ల ధాటికి రోజున్నరకే శ్రీలంక ఏ ఆలౌటైంది. అకీబ్ నబీ దార్(4-58) పేస్ను ఎదుర్కోలేక ఆతిథ్య జట్టు బ్యాటర్లు తోకముడవగా.. 330 రన్స్కే కుప్పకూలింది. దాంతో, భారత ఏ జట్టుకు 160 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లోనూ టీమిండియాకు శుభారంభమివ్వాలనుకున్న ఓపెనర్ సాయి సుదర్శన్(7) రిటైర్డ్ హర్టయ్యాడు. ప్రస్తుతం ఆయుష్ పాండే, దేవ్దత్ పడిక్కల్ ఆడుతున్నారు.
గాలే స్టేడియంలో జరుగుతున్న మొదటి అనధికారిక టెస్టులో భారత ఏ పట్టుబిగించింది. రంజీ వీరుడు అకీబ్ నబీ(4-58) బంతితో విజృంభించగా మూడోరోజే శ్రీలంక ఏ కుప్పకూలింది. ఓవర్ నైట్ స్కోర్ 113/2తో ఇన్నింగ్స్ మొదలెట్టిన లంకను యశ్ ఠాకూర్(2-51) దెబ్బకొట్టాడు. అర్ధశతకంతో విసిగించిన నువనిందు ఫెర్నాండో(84)ను ఔట్ చేసిన ఠాకూర్ వికెట్ల వేటకు తెరతీశాడు. అంజల బండార(70)ను వెనక్కి పంపిన నబీ.. లోయర్ ఆర్డర్ను పడగొట్టాడు. నబీ ధాటికి శ్రీలంక ఏ 330 పరుగులకే ఆలౌటైంది.
Auqib Nabi starred with a brilliant four-wicket haul as India A secured a commanding 122-run first-innings lead over Sri Lanka A.#TeamIndia #AuqibNabi #INDvsSL #Cricket pic.twitter.com/5JaoVs16OF
— InsideSport (@InsideSportIND) June 27, 2026
ఓపెనర్ సాయి సుదర్శన్(132), ఆయుష్ పాండే(25)లు భారత ఏ జట్టుకు శుభారంభమిచ్చారు. తొలి వికెట్కు 92 రన్స్ జోడించిన సాయి.. ఆ తర్వాత దేవ్దత్ పడిక్కల్(12), రుతురాజ్ గైక్వాడ్(22)లతో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. షేక్ రషీద్(63), ధ్రువ్ జురెల్(141 నాటౌట్) మెరవగా.. తొలి రోజే 4 వికెట్ల నష్టానికి 333 రన్స్ కొట్టిన భారత్.. రెండో రోజూ జోరు చూపింది.
ధ్రువ్ జురెల్(141 నాటౌట్)

రషీద్తో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన జురెల్ రెండో రోజు లంక బౌలర్లను పరీక్షించాడు. హర్ష్ దూబే(30)తో కలిసి స్కోర్ నాలుగొందలు దాటించాడు. దూబేను గుణశేఖర( 3-84) ఔట్ చేశాక 452-6 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది భారత ఏ.