బ్యాంకాక్: భారత స్టార్ లాంగ్ జంపర్ మురళి శ్రీశంకర్ వచ్చే ఏడాది పారిస్లో జరుగనున్న ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్లో భారత్ నుంచి పారిస్ విశ్వక్రీడలకు ఎంపికైన తొలి అథ్లెట్గా నిలిచాడు. శనివారం పోటీల్లో శ్రీశంకర్ 8.37 మీటర్లు లంఘించి సిల్వర్ మెడల్ సొంతం చేసుకోగా.. టాంగ్ లిన్ (8.40 మీ.) పసిడి పతకం నెగ్గాడు.
మరోవైపు మిక్స్డ్ 4×400 మీటర్ల రిలేలో రాజేశ్, జాకబ్, ఐశ్వర్య, సుభతో కూడిన భారత జట్టు జాతీయ రికార్డు బద్దలు కొడుతూ బంగారు పతకం కైవసం చేసుకుంది. హై జంప్లో సర్వేశ్ అనిల్, హెప్టాథ్లాన్లో స్వప్న బర్మన్ రజత పతకాలు నెగ్గారు.