WPL 2024 | ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ 2024)లో శనివారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి చివరి ఓవర్ లో ఒక బంతి మిగిలి ఉండగానే చేధించింది. ముంబై ఇండియన్స్ సారధి హర్మన్ ప్రీత్ కౌర్ ఆకాశమే హద్దుగా 48 బంతుల్లో 10 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 95 పరుగులు చేసింది. ఓపెనర్ యాస్తికా భాటియా కూడా 36 బంతుల్లో ఎనిమిది పోర్లు, ఒక సిక్సర్ తో 49 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో షబ్నం, తనూజా కన్వర్, ఆష్లీ గార్డనర్ ఒక్కో వికెట్ తీశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. బెత్ మూనీ 35 బంతుల్లో 66 పరుగులు, దయాళన్ హేమలత 74 పరుగులతో అర్థ సెంచరీలు చేస్తే, భారతి పుల్మాలీ 21 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ బౌలర్లలో సైకా ఇషాక్ రెండు, హేలీ మాథ్యూస్, షబ్నం, పూజా వస్త్రాకర్, సజనా ఒక్కో వికెట్ తీశారు.