WPL | న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్లో ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఎలిమినేటర్ పోరుకు సిద్ధమయ్యాయి. శుక్రవారం ఇరు జట్లు ఫైనల్ బెర్తు కోసం తలపడనున్నాయి. లీగ్ దశలో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన ముంబై, బెంగళూరు..ఢిల్లీతో టైటిల్ పోరులో నిలిచేందుకు తహతహలాడుతున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ముంబై మరోమారు తుది పోరుకు అర్హత సాధించాలని చూస్తుంటే..తొలిసారి ఫైనల్ ఫైట్లో నిలిచేందుకు బెంగళూరు పట్టుదలతో ఉంది.