ముంబై: ముంబై ఇండియన్స్ స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఫిట్నెస్పై ఇంకా సందిగ్ధత నెలకొన్నది. లీగ్లో భాగంగా ఈ నెల 24న ముంబై, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగే తొలి మ్యాచ్కు సూర్య దూరం కానున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో అతను పునరావాసం పొందుతున్నాడు. గత డిసెంబర్లో గాయపడ్డ ఈ డాషింగ్ బ్యాటర్..జాతీయ జట్టుకు దూరమయ్యాడు.
ఇదిలా ఉంటే మంగళవారం ఎన్సీఏలో సూర్యకు ఫిట్నెస్ పరీక్ష నిర్వహించగా, పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. గురువారం మరోమారు పరీక్ష నిర్వహించి అతని ఫిట్నెస్పై నిర్ధారణ వస్తామని ఎన్సీఏ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో హైదరాబాద్ (మార్చి 27), రాజస్థాన్ (ఏప్రిల్ 1), ఢిల్లీ (ఏప్రిల్ 7) మ్యాచ్లకు కూడా సూర్య దూరమయ్యే చాన్స్ కనిపిస్తున్నది. తన గాయాన్ని సూచిస్తూ లీగ్కు దూరం కాబోతుండటంపై పగిలిన హృదయంతో ఉన్న ఏమోజీని సూర్య ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు.