Hardik Pandya | ముంబై: ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ నెగ్గిన నాయకుడు, రెండు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన జట్టులోని సభ్యుడు, టీమ్ఇండియాను రెండు సార్లు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్కు చేర్చిన సారథి, గడిచిన 10-12 ఏండ్లుగా భారత జట్టు బ్యాటింగ్ బాధ్యతలు మోస్తున్న రోహిత్ శర్మ ఆదివారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో సాధారణ ఆటగాడు అయిపోయాడు. తాజా ఐపీఎల్ సీజన్కు కొద్దిరోజుల ముందు ముంబై.. హిట్మ్యాన్ను సారథిగా తప్పించి గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా ఉన్న హార్దిక్ను అరువు తెచ్చుకుని అతడికి పగ్గాలు అప్పజెప్పింది.
ఈ విషయమై ఇప్పటికే అగ్గిమీద గుగ్గిలంలా మండుతున్న రోహిత్ ఫ్యాన్స్.. ఆదివారం నాటి మ్యాచ్లో రోహిత్ను హార్దిక్ ట్రీట్ చేసిన విధానంపై మండిపడుతున్నారు. సాధారణంగా స్లిప్స్, థర్టీ యార్డ్ సర్కిల్ లోపల ఫీల్డింగ్ చేసే రోహిత్ను పాండ్యా బౌండరీ లైన్ను చూపిస్తూ త్వరగా వెళ్లమని హుకుం జారీ చేశాడు. నాన్ స్ట్రయికర్ ఎండ్ నుంచి రోహిత్ను అటు వెళ్లు.. ఇటు వెళ్లు అని ఆదేశాలివ్వడం కోపం తెప్పించింది. సోమవారమంతా ఎక్స్ (ట్విటర్) లో సైతం ఛప్రి హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది. ఓ కుక్క ఫీల్డ్లోకి రాగా అక్కడున్న ప్రేక్షకులు దానిని చూస్తూ ‘హార్దిక్.. హార్దిక్’ అని అరిచారు.