Mumbai Indians : ఐపీఎల్ 17వ సీజన్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్(Mumbai Indians) కెప్టెన్సీ మార్పు పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఐదు ట్రోఫీలు కట్టబెట్టిన రోహిత్ శర్మ(Rohit Sharma)ను కాదని హార్దిక్ పాండ్యా (Hardhik Pandya)కు పగ్గాలు అప్పగించడాన్ని ముంబై ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. సోషల్ మీడియాలో వేలాది మంది ఫాలోవర్స్ ఆ ఫ్రాంజైజీకి గుడ్ బై చెప్పారు. రోహిత్ను సారథగా తప్పించడంపై ముంబై హెడ్కోచ్ మార్క్ బౌచర్(Mark Bourcher) ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
‘రోహిత్ రెండు సీజన్లు బ్యాటుతో పెద్దగా రాణించలేదు. కానీ కెప్టెన్గా మాత్రం ఆకట్టుకున్నాడు. అతడిలోని మునపటి ఆటగాడిని మేము చూడాలనుకుంటున్నాం. కెప్టెన్సీ భారం లేకుండా రోహిత్ స్వేచ్ఛగా ఆడాలని మేనేజ్మెంట్ భావిస్తోంద’ని బౌచర్ తెలిపాడు.
Mumbai Indians head coach Mark Boucher explains the captaincy switch from Rohit Sharma to the returning Hardik Pandya 👇 pic.twitter.com/zxvb8Jelos
— ESPNcricinfo (@ESPNcricinfo) February 6, 2024
‘సారథిగా రోహిత్పై ఉన్న ఒత్తిడిని తగ్గించాలనుకున్నాం. ముఖంపై నవ్వుతో బ్యాటింగ్ చేసే హిట్మ్యాన్ను చూడాలనేది మా అందరి లక్ష్యం. ఇక హార్ధిక్ విషయానికొస్తే.. అతడు ముంబై ఆటగాడే. మరో ఫ్రాంచైజీకి వెళ్లి కెప్టెన్గా ట్రోఫీ గెలిచాడు. రెండో ఏడాది ఆ జట్టును రన్నరప్గా నిలిపాడు. అతడి నాయకత్వ లక్షణాలు అమోఘం. కెప్టెన్సీ మార్పు అనేది క్రికెట్ పరమైన నిర్ణయం. ఇకపై రోహిత్ స్వేచ్ఛగా ఆడొచ్చు. పరుగులు సాధించడంపై దృష్టి పెట్టవచ్చు’ అని బౌచర్ తెలిపాడు. అయితే.. బౌచర్ వ్యాఖ్యల్ని రోహిత్ భార్య రితికా సజ్దేహ్ (Ritika Sajdeh) కొట్టిపారేసింది. బౌచర్ చెప్పినవ వాటిలో చాలా అబద్దాలు ఉన్నాయని ఆమె ఆరోపించింది.
ఐపీఎల్ ట్రోఫీతో రోహిత్ శర్మ
ఐపీఎల్ టోర్నీలో ముంబై ఇండియన్స్ విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలవడం వెనక రోహిత్ శర్మ కృషి ఎనలేనిది. ఆటగాడిగా, కెప్టెన్గా రాణిస్తూనే ముంబైకి ఏకంగా ఐదు టైటిళ్లు అందించాడు. అతడిసారథ్యంలోని ముంబై 2013, 2015, 2017, 2019తో పాటు 2020లో ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. అయితే.. 15వ సీజన్లో సమిష్ఠి వైఫల్యంతో నిరాశపరిచిన ముంబై.. 16వ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరుకుంది. 15వ సీజన్లో హిట్మ్యాన్ 268 పరుగులతో నిరాశపరిచాడు. కానీ, 2023లో ఈ విధ్వంసక ఓపెనర్ దంచికొట్టాడు. 16 మ్యాచుల్లో 332 రన్స్ కొట్టి ముంబై ప్లే ఆఫ్స్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.
ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 23 నుంచి ప్రారంభం కానుంది. వరల్డ్ కప్లో గాయపడిన పాండ్యా ఈ మధ్యే కోలుకొని ఫిట్నెస్పై దృష్టి పెట్టాడు. బరోడా మైదానంలో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో విడుదల చేశాడు. దాంతో, ఐపీఎల్ 2024 ఎడిషన్లో అతడు ముంబై కెప్టెన్గా బరిలోకి దిగడం ఖాయమనిపిస్తోంది.