ముంబై: తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. ఆదివారం డబుల్ హెడర్లో భాగంగా జరిగిన తొలి పోరులో ముంబై 8 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. సీజన్ ఆసాంతం నిరాశ పరిచిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (46 బంతుల్లో 83; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆఖరి మ్యాచ్లో టాప్ స్కోరర్గా నిలువగా..
యువ ఓపెనర్ వివ్రాంత్ శర్మ (47 బంతుల్లో 69; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. ముంబై బౌలర్లలో ఆకాశ్ 4 వికెట్లు పడగొట్టాడు. లక్ష్యఛేదనలో ముంబై 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. కామెరూన్ గ్రీన్ (47 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (37 బంతుల్లో 56; 8 ఫోర్లు, ఒక సిక్సర్), సూర్యకుమార్ యాదవ్ (25 నాటౌట్; 4 ఫోర్లు) రాణించారు. గ్రీన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.
సంక్షిప్త స్కోర్లు హైదరాబాద్: 200/5 (మయాంక్ 83, వివ్రాంత్ 69; ఆకాశ్ 4/37),
ముంబై: 18 ఓవర్లలో 201/2 (గ్రీన్ 100*; రోహిత్ 56; భువనేశ్వర్ 1/26).