ముంబై: ఐపీఎల్ 15వ సీజన్లో ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. గత ఎనిమిది మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైన రోహిత్ సేన శనివారం జరిగిన రెండో పోరులో 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్పై కష్టపడి గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. జోస్ బట్లర్ ( 67) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. పడిక్కల్ (15), కెప్టెన్ సంజూ శాంసన్ (16), డారిల్ మిషెల్ (17) మంచి ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోగా.. ఆఖర్లో రవిచంద్రన్ అశ్విన్ (21) బ్యాట్ ఝళిపించాడు. ముంబై బౌలర్లలో మెరిడిత్, హృతిక్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ముంబై 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (51), తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ (35్ల) రాణించారు.
సంక్షిప్త స్కోర్లు
రాజస్థాన్: 20 ఓవర్లలో 158/6 (బట్లర్ 67; మెరిడిత్ 2/24, హృతిక్ షోకీన్ 2/47), ముంబై: 19.2 ఓవర్లలో 161/5 (సూర్యకుమార్ 51, తిలక్ 35; అశ్విన్ 1/21).