MS Dhoni : భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)కి బైక్లు, కార్లు నడపడమంటే ఎంతిష్టమో తెలిసిందే. సమయం దొరికితే చాలు మహీ రాంచీ వీధుల్లో చక్కర్లు కొడుతుంటాడు. ఈ మధ్యే అతను నీలం రంగు వింటేజ్ రాల్స్ రాయిస్(blue Rolls Royce) కారు డ్రైవింగ్ చేస్తున్న వీడియో వైరల్ అయింది. తాజాగా ఈ దిగ్గజ క్రికెటర్ రాంచీ స్టేడియం(Jharkhand State Cricket Association Stadium) బయట ట్రాఫిక్ పోలీస్తో సెల్ఫీ దిగాడు. ఆ ఫొటో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్ అవుతోంది.
ఆ ఫొటో చూసిన ఫ్యాన్స్.. ‘ధోనీది ఎంత మంచి మనసు. అతను గొప్ప వ్యక్తి’ అంటూ కామెంట్లు పెడతున్నారు. ప్రస్తుతం ధోనీ మోకాలి గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023) ఫైనల్ మ్యాచ్కు ముందు గాయపడిన అతను ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకున్నాడు.
టీమిండియా గొప్ప కెప్టెన్లలో ఒకడైన ధోనీ దేశానికి మూడు ఐసీసీ ట్రోఫీ(ICC Trophy)లు అందించాడు. ఆ తర్వాత ఐపీఎల్లోనూ మహీ తన ముద్ర వేశాడు. చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)కు 5 ట్రోఫీలు అందించాడు. పెద్దగా అనుభవం లేని యువకులతో జట్టును ఫైనల్కు తీసుకెళ్లడమే కాకుండా విజేతగా నిలిపాడు.
మహేంద్ర సింగ్ ధోనీ
దాంతో, ఐదు ట్రోఫీలతో చెన్నై జట్టు ముంబై ఇండియన్స్(Mumbai Indians) రికార్డు సమం చేసింది. అయితే.. ధోనీ వచ్చే సీజన్లో ఆడతాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఐపీఎల్ రిటైర్మెంట్పై ఈ స్టార్ ప్లేయర్ ఎలాంటి ప్రకటన చేయలేదు. దాంతో, సీజన్ మొదలయ్యే వరకు ఏదో ఒక విషయం తేలనుంది.