రాంచీ: క్రికెటర్ ఎంస్ ధోనీ(MS Dhoni) ప్రస్తుతం తన స్వంత ఊరు రాంచీలో టైంపాస్ చేస్తున్నాడు. రకరకాల వింటేజ్ కార్లు, బైక్లపై తిరుగుతూ .. హోమ్టౌన్ వెదర్ను ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా అతను తన మిత్రుడితో కలిసి కారులో ఓ టూర్ వెళ్లాడు. అయితే క్రికెట్ అభిమానుల నుంచి అతను నావిగేషన్ హెల్ప్ తీసుకున్నాడు. ఓ రూట్లో చిక్కుకున్న అతను.. రాంచీ ఎటువైపో అడిగి తెలుసుకున్నాడు. బైక్ మీద ధోనీని ఫాలో అయిన ఆ అభిమానులు అతనికి రాంచీ ఎలా వెళ్లాలో చెప్పారు. ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ధోనీ ఫ్రెండ్ డ్రైవింగ్ చేస్తుండగా, అతను మాత్రం ముందు సీటులో కూర్చుకున్నాడు. ముందు ఓ సర్కిల్ వస్తుందని, అక్కడ నుంచి వెళ్తే రాంచీకి చేరుకుంటారని ఓ అభిమాని చెప్పాడు. ఆ విగ్రహం ఉన్న సర్కిల్ వద్ద రౌండ్ తీసుకోవాలా అని ధోనీ ఆ అభిమానిని అడిగాడు. బైక్పై ఫాలో అయిన అభిమానులతో ధోనీ ఫోటో దిగాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్లో చెన్నైకి అయిదోసారి టైటిల్ అందించిన ధోనీ.. ఇటీవల తన మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఇక అతను వచ్చే ఐపీఎల్ ఆడేది ఇంకా స్పష్టంగా తెలియదు.
This man is so simple and this simplicity is what makes him different from every other celebrity #MSDhoni #Dhoni pic.twitter.com/ErMlX3KGVX
— TAAGASTYA (@LalPatrakar) August 11, 2023