టీమిండియా సీనియర్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ 2005 లో చేసిన రికార్డు గుర్తుందా? అది ఇదే రోజు. అక్టోబర్ 31, 2005న ప్రపంచం మొత్తం ఇండియా వైపే చూసింది. ఆరోజు తన కెరీర్ బెస్ట్ 183 పరుగులు చేసి ధోనీ సరికొత్త రికార్డు సృష్టించాడు. శ్రీలంకతో జరిగిన ఏడు వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా జైపూర్లో జరిగిన మూడో వన్డే మ్యాచ్లోనే ధోనీ చెలరేగిపోయాడు.
కేవలం 145 బంతుల్లో 183 పరుగులు చేసి తన వన్డే కెరీర్లోనే సరికొత్త రికార్డు సృష్టించాడు ధోనీ. జైపూర్లోని మాన్సింగ్ స్టేడియంలో మ్యాచ్ జరిగింది. అప్పటికే ధోనీ.. పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో 123 బంతుల్లో 148 పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేశాడు. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో చెలరేగిపోయి ఆడాడు.
ఆ మ్యాచ్లో ధోనీ కొట్టిన షాట్స్కు సంబంధించిన వీడియోను తాజాగా బీసీసీఐ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. 183 పరుగులు, 145 బంతులు, 15 ఫోర్లు, 10 సిక్సులు.. ఇదే రోజు 2005లో ధోనీ సృష్టించిన సునామీ అంటూ.. వీడియోను షేర్ చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Inda vs New Zealand : టీమిండియా సత్తా చాటాల్సిన టైమ్ వచ్చేసింది.. న్యూజిలాండ్ను చిత్తు చేస్తుందా?
కొద్ది గంటల్లో న్యూజిలాండ్తో భారత్ ఢీ.. బోణీ కోసం ఇరుజట్లు తహతహ