MS Dhoni | భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) ప్రస్తుతం ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఈ లెజెండరీ క్రికెటర్ తన బార్య సాక్షి సింగ్ ధోనీ (sakshi singh dhoni)తో కలిసి తమ పూర్వీకుల ఇంటికి వెళ్లాడు. ఉత్తరాఖండ్లోని అల్మోరా జిల్లాలోని ల్వాలి (Lwali) గ్రామంలో ఉన్న తమ తాత ముత్తాతల ఇంటిని సందర్శించాడు. అక్కడ బంధువులు, స్థానికులతో సరదాగా ముచ్చటించాడు. ఈ సందర్భంగా ధోనీ దంపతులు పెద్దల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం (Blessings From Elders) తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Most down to earth cricketer @msdhoni for countless reasons.
Here’s the unseen version from the much loved video!! 😇❤️ pic.twitter.com/cMmdT9yVut
— DIPTI MSDIAN (@Diptiranjan_7) November 16, 2023
కాగా, ఈ పర్యటనకు సంబంధించిన ఫొటోలను సాక్షి సింగ్ ధోనీ ఇప్పటికే ఇన్స్టా వేదికగా షేర్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఫొటోలో ధోనీ దంపతులు ఆ ఇంటి ముందు కూర్చొని నవ్వుతూ ఫొటోలు దిగారు. ఆ ఫొటోతో పాటు ఆ ఇంటి వీడియోను కూడా సాక్షి సింగ్ ఆన్లైన్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటో, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
టీమిండియా గొప్ప కెప్టెన్లలో ధోనీ పేరు ముందువరసలో ఉంటుంది. అతడి సారథ్యంలోనే భారత్ మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచింది. 2019 వరల్డ్ కప్లో న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్లో ధోనీ రనౌటయ్యాడు. ఆ క్షణమే ఆటకు రిటైర్మెంట్ ఇవ్వాలని అనుకున్నాడు. అయితే.. 2020 ఆగష్టులో మహీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్లో మాత్రమే ఆడుతున్నాడు. 16వ సీజన్లో ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి ఐపీఎల్ చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే.
Also Read..
World Cup Final | వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు మోదీ, ధోనీ.. స్పెషల్ అట్రాక్షన్గా వాయుసేన విన్యాసాలు
David Beckham | డేవిడ్ బెక్హమ్కు అంబానీ కుటుంబం ప్రత్యేక ఆతిథ్యం.. పిక్ వైరల్
Hardik Pandya: ఆసీస్తో టీ20 సిరీస్.. హార్దిక్ పాండ్యా దూరం