చెన్నై: గాయంతో ఐపీఎల్-19లో ఆరంభ మ్యాచ్కు దూరమైన సీఎస్కే మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అనుకున్న సమయానికంటే ముందే రీఎంట్రీ ఇస్తాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. కండరాల నొప్పితో బాధపడుతూ కనీసం నాలుగువారాలైనా ఆటకు దూరమవుతాడని సీఎస్కే వర్గాలు చెప్పినా రెండువారాల్లోపే మహీ కమ్బ్యాక్ ఇస్తాడని సమాచారం.
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ధోనీ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు వైరల్ అవడంతో ధోనీ రీఎంట్రీ ముందుగానే ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అన్నీ కుదిరితే చెన్నై ఆడే మూడో మ్యాచ్ (ఈనెల 11) నాటికి ధోనీ సిద్ధమవుతాడని వినికిడి. అయితే దీనిపై సీఎస్కే నుంచి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు.