జోధ్పూర్ : రాజస్థాన్ జోధ్పూర్లో దేశంలోనే తొలి బ్రీత్ బ్యాంక్ ప్రారంభమైంది. కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో ఆక్సిజన్ కోసం ప్రజలు పడే తపన చూసి రాజస్తౄన్ ప్రభుత్వం ఈ వినూత్న బ్యాంక్ను ఏర్పాటుచేసింది. ఈ బ్రీత్ బ్యాంక్ కార్యాలయాన్నిముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ సమక్షంలో వర్చువల్గా ప్రారంభించారు. రోగులకు సజావుగా ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఈ బ్యాంక్ను స్థాపించారు.
500 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల సామర్థ్యం కలిగిన ఈ బ్యాంకు మొత్తం దేశంలోనే ఈ రకమైన మొదటి బ్యాంకు. శాస్త్రి నగర్ ఈ-సెక్టార్లో ఈ బ్రీత్ బ్యాంక్ కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. ఈ బ్యాంకుతోపాటు ప్లాస్మా బ్యాంకును కూడా నెలకొల్పాలని అధికారులు యోచిస్తున్నారు. బ్రీత్ బ్యాంకు ఏర్పాటు రాజస్థాన్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని మానవ హక్కు కమిషన్ చైర్మన్ జస్టిస్ గోపాల్ కృష్ణజీ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జోధ్పూర్ మాజీ రాజు గాజ్ సింగ్, జస్టిస్ వినీత్ కొఠారి, జస్టిస్ సందీప్ మెహతా తదితరులు వర్చువల్గా పాల్గొన్నారు. కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందడం, ఆక్సిజన్ కరువు పెరగడం వల్ల మరణాలు పెరుగుతున్న దృష్ట్యా ఇదే నగరానికి చెందిన నిర్మల్ గెహ్లాట్ అనే సామాజిక కార్యకర్త ఈ బ్రీత్ బ్యాంకును స్థాపించడానికి చొరవ తీసుకున్నారు.
జోధ్పూర్ జిల్లా కలెక్టర్ ఇంద్రజిత్ సింగ్ బ్రీత్ బ్యాంక్ భావనను కొనియాడారు. ప్రస్తుతం జోధ్పూర్ నగరంతోపాటు డివిజన్ అంతటా వచ్చే రోగులకు ఆక్సిజన్ చాలా అవసరం అని, రోగులకు సజావుగా ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఈ బ్రీత్ బ్యాంక్ స్థాపించినట్లు తెలిపారు. అలాగే, జోధ్పూర్లోని మహాత్మా గాంధీ దవాఖానలో నిమిషానికి 800 లీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ ప్లాంట్ను కూడా బ్యాంకు ఏర్పాటు చేయనున్నది, ఈ నెల 22 లోగా ప్రారంభించే అవకాశం ఉన్నది. అన్ని యంత్రాలు రాగానే మే 13 నుంచి ఆక్సిజన్ నిరంతరం అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ఇంద్రజిత్ సింగ్ పేర్కొన్నారు.
ఆర్టికల్ 370 తొలగింపు భారత్ అంతర్గత విషయం: మహమూద్ ఖురేషి
చేతులు కలుపనున్న అగ్రరాజ్యాలు.. పుతిన్కు బైడెన్ ఆహ్వానం
పాకిస్తాన్లో అసిస్టెంట్ కమిషనర్గా హిందూ యువతి
కరోనా వేళ ఖరీదవుతున్న ఆహారాలు
జూలై కల్లా ముగియనున్న కరోనా సెకండ్ వేవ్ : ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు
ఐరోపాలో ముగిసిన రెండో ప్రపంచ యుద్ధం.. చరిత్రలో ఈరోజు
బెంగాల్ స్పీకర్గా బిమన్ బెనర్జి.. వరుసగా మూడోసారి ఎంపిక..!
మార్స్పై నాసా హెలికాప్టర్ చక్కర్లు.. తొలిసారి ఆడియో కూడా రికార్డ్.. వీడియో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..