న్యూఢిల్లీ: టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హాజిల్వుడ్ సిరాజ్ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియాకే చెందిన మరో బౌలర్ మిచెల్ స్టార్క్ సిరాజ్తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు.
మిచెల్ స్టార్క్ భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మొదటి, రెండో వన్డేల్లో అద్భుతంగా రాణించాడు. మహ్మద్ సిరాజ్ మొదటి వన్డేలో 29 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టడం ద్వారా మంచి ప్రదర్శనే చేసినా.. రెండో వన్డేలో కేవలం మూడు ఓవర్లో 37 పరుగులిచ్చాడు. దాంతో బౌలింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని చేజార్చుకున్నాడు.
విశాఖలో ఆస్ట్రేలియా బ్యాటర్లు మిచెల్ స్టార్క్, ట్రావిస్ హెడ్ వీరవిహారం చేయడం ద్వారా సిరాజ్ బౌలింగ్లో భారీగా పరుగులు రాబట్టారు. అయితే, ఇటీవల అన్ని ఫార్మాట్లలో సిరాజ్ బాగా రాణిస్తున్నాడు. అందుకే ఈ ఏడాది జనవరిలో వన్డే బౌలింగ్ ర్యాంకుల్లో అగ్ర స్థానానికి చేరుకున్నాడు.