న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు ముందు టీమ్ఇండియాకు ఎదురుదెబ్బ తగిలింది. సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami) కరోనా బారిన పడ్డాడు. దీంతో ఆస్ట్రేలియాతో సోమవారం (ఈ నెల 20) నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు దూరమయ్యాడు. షమీ స్థానంలో మరో బౌలర్ ఉమేశ్ యాదవ్ను జట్టులోకి ఎంపిక చేశారు.
షమీ.. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో తక్కువ మ్యాచ్లే ఆడినప్పటికీ ఇటీవల ముగిసిన ఐపీఎల్లో అతని ప్రదర్శన ఆధారంగా ఆసిస్తో సిరీస్కు అతడిని జట్టులోకి ఎంపిక చేశారు. ఈ 32 ఏండ్ల పేసర్ ఐపీఎల్లో అరంగేట్రంలోని అదరగొట్టిన గుజరాత్ టైటన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. గత ఐపీఎల్ను గుజరాత్ జట్టు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఆస్ట్రేలియాలో జరుగనున్న టీ 20 వరల్డ్ కప్కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు కూడా షమీ ఎంపికయ్యాడు. అయితే అతడిని స్టాండ్బై ప్లేయర్గా జట్టులోకి తీసుకున్నారు. అంటే ఒక బౌలర్ గాయపడితే, షమీని ప్రధాన జట్టులోకి తీసుకుంటారు.