న్యూఢిల్లీ: గాయం కారణంగా టీ20 ప్రపంచకప్నకు దూరమైన ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీ మెగాటోర్నీకి ఎంపికయ్యాడు. ఇప్పటికే స్టాండ్బై ఆటగాడిగా ఉన్న షమీని ప్రధాన జట్టులో చేర్చుతున్నట్లు బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్ కారణంగా భారత్ ఆడిన గత రెండు సిరీస్లకు దూరమైన షమీ.. పొట్టి ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా చేరుకున్నాడని బోర్డు కార్యదర్శి జై షా పేర్కొన్నాడు. హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ బ్యాకప్ ప్లేయర్లుగా ఆసీస్ వెళ్లనున్నట్లు జై షా తెలిపాడు. ఆదివారం నుంచి మెగాటోర్నీ ప్రారంభం కానుండగా.. ఈ నెల 23న రోహిత్ సేన తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో తలపడనుంది.