న్యూఢిల్లీ: భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ.. ఐపీఎల్కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చీలమండ గాయం కారణంగా చాన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న 33 ఏండ్ల షమీ.. త్వరలోకాలికి శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు. దీంతో వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్లో అతడు అందుబాటులో ఉండటం కష్టమే అని బీసీసీఐ అధికారి తెలిపాడు.
‘గత నెలలో లండన్ వెళ్లిన షమీ ప్రత్యేక వైద్యం చేయించుకున్నాడు. అయితే అది పెద్దగా ప్రభావం చూపలేదు. ఇప్పుడు శస్త్రచికిత్సే మార్గం. దీని కోసం అతడు యూకే వెళ్లనున్నాడు. అంటే ఐపీఎల్ అంశం చర్చకే రాదు’ అని పేర్కొన్నాడు.