BCCI | న్యూఢిల్లీ: బీసీసీఐ త్వరలో భర్తీ చేయనున్న సెలెక్టర్ల రేసులో మాజీ క్రికెటర్లు నిఖిల్ చోప్రా, మిథున్ మన్హాస్తో పాటు ఇది వరకే జూనియర్ సెలక్టర్గా ఉన్న కృష్ణ మోహన్ పోటీలో ఉన్నారు. వెస్ట్జోన్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న సలీల్ అంకోలా త్వరలోనే ఆ పదవి నుంచి వైదొలగనున్న నేపథ్యంలో బీసీసీఐ జనవరిలోనే ఈ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది.
ప్రస్తుతం చీఫ్ సెలెక్టర్గా ఉన్న అజిత్ అగార్కర్ సైతం వెస్ట్జోన్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో అంకోలా తప్పుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. కొత్తగా నియమితుడయ్యే సెలెక్టర్ నార్త్జోన్ (చేతన్ శర్మ రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయింది)కు రిప్రజెంట్ చేయనున్నాడు.