భారత మహిళా క్రికెట్లో ఒక శకం ముగిసింది. సుదీర్ఘకాలం భారత మహిళా జట్టును ముందుకు నడిపించిన ప్లేయర్ మిథాలీ రాజ్.. తన క్రికెట్ కెరీర్కు గుడ్బై చెప్పేసింది. ఈ క్రమంలో ఆమె నెక్స్ట్ ఏం చేస్తుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. దీనిపై ఆమెతో మాట్లాడుతూ.. క్రికెట్ అడ్మినిస్ట్రేషన్లో అవకాశం లభిస్తే దానికి మీరు అంగీకరిస్తారా? అని ప్రశ్నించగా మిథాలీ సంతోషం వ్యక్తం చేసింది.
తనకు అలాంటి అవకాశం లభిస్తే చాలా ఆనందిస్తానని చెప్పింది. ‘‘మహిళల క్రికెట్ను మహిళలే బాగా అర్థం చేసుకోగలరు. అందుకే కొన్ని పదవుల్లో మహిళలు ఉంటేనే ఉపయోగకరంగా ఉంటుంది. ఇది నేను ఊరికే అంటున్న మాట కాదు. బెలిండా క్లార్క్.. ఆస్ట్రేలియా క్రికెట్ను ఎలా రూపుదిద్దిందో మనందరికీ తెలుసు. అలాగే ఈసీబీని క్లేర్ కానర్ కూడా అద్భుతంగా తీర్చిదిద్దింది.
కాబట్టి మహిళల క్రికెట్లో కొన్ని బాధ్యతలను మహిళలు మాత్రమే అద్భుతంగా నిర్వర్తించగలుగుతారని నా నమ్మకం’’ అని మిథాలీ చెప్పింది. అలాగే అలాంటి అవకాశమే లభిస్తే తన అనుభవాన్ని రంగరించి మంచి ఫలితాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపింది.