Australia Cricket Fan : వరల్డ్ కప్ విజేత ఆస్ట్రేలియా(Australia) సొంత గడ్డపై పాకిస్థాన్(Pakistan)తో జరుగుతున్న టెస్టు సిరీస్లో దూకుడుగా ఆడుతోంది. పెర్త్ స్టేడియం(Perth Stadium)లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 360 పరుగుల తేడాతో పాకిస్థాన్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో బ్యాటుతో, బంతితో రాణించిన ఆల్రౌండర్ మిచెల్ మార్ష్(Mitchell Marsh) ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. అయితే.. ఆ అవార్డును అతడు ఎవరికి ఇచ్చాడో తెలుసా..? స్టేడియంలో మ్యాచ్ చూసేందుకు వచ్చిన యువ అభిమానికి గిఫ్ట్గా ఇచ్చాడు.
బహుమత్రి ప్రదానం అనంతరం ప్రేక్షకుల దగ్గరికి నడుచుకుంటూ వెళ్లిన మార్ష్ అతడి మెడలో వేశాడు. సర్ప్రైజ్ గిఫ్ట్ అందుకున్న లిటిల్ ఫ్యాన్ సంతోషంలో మునిగిపోయాడు. ఆ వీడియోను ఆస్ట్రేలియా క్రికెట్ ఎక్స్ ఖతాలో పోస్ట్ చేసింది. అయితే.. వన్డే వరల్డ్ కప్ ట్రోఫీపై కాళ్లు పెట్టి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మార్ష్.. స్వదేశంలో మాత్రం హుందాగా ప్రవర్తించడం విడ్డూరంగా ఉందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
Mitch Marsh – what a guy! A special end to the West Test for this young fan.
via https://t.co/iA8L5eeOt5 pic.twitter.com/FuVjzmc4d9
— cricket.com.au (@cricketcomau) December 17, 2023
మూడు టెస్టుల సిరీస్లో భాగంగా పెర్త్లో జరిగిన తొలి టెస్టులో ఓపెనర్ డేవిడ్ వార్నర్(180) సెంచరీతో మెరిశాడు. ఇక మిడిలార్డర్లో వచ్చిన మార్ష్ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. 90 పరుగులు చేసిన ఈ ఆల్రౌండర్ అనంతరం పాకిస్థాన్ మాజీ సారథి బాబర్ ఆజాం(21) వికెట్ తీశాడు. ఇక రెండో ఇన్నింగ్స్లోనూ మార్ష్ 63 నాటౌట్తో జట్టుకు భారీ స్కోర్ అందించాడు.
మిచెల్ మార్ష్
450 పరుగుల ఛేదనలో పాక్ను స్టార్క్, హేజిల్వుడ్ దెబ్బకొట్టారు. వీళ్లిద్దరూ మూడేసి వికెట్లు పడగొట్టడంతో పాక్ 89 పరుగులకే ఆలౌటయ్యింది. రెండు ఇన్నింగ్స్ల్లో అద్భుతంగా రాణించిన మార్ష్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుకు ఎంపికయ్యాడు. తొలి టెస్టులో విజయంతో ఆసీస్ మూడు మ్యాచ్ల సిరీస్లో 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మెల్బోర్న్లో డిసెంబర్ 26న జరుగనుంది.