న్యూఢిల్లీ: వరల్డ్కప్లో రేపు ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అహ్మాదాబాద్లోని మోదీ స్టేడియం ఆ ఫైనల్ కోసం రెఢీ అయ్యింది. వాస్తవానికి ఈ రెండు జట్లు ఫైనల్లో ప్రవేశించడానికి కొన్ని నెలల ముందే.. ఆస్ట్రేలియా బ్యాటర్ మిచెల్ మార్ష్(Mitchell Marsh) ఓ అంచనా వేశాడు. వరల్డ్కప్ ఫైనల్లో ఇండియా, ఆస్ట్రేలియా తలపడనున్నట్లు పేర్కొన్నాడు. ఆ ఫైనల్లో ఇండియాను తన స్వంత గడ్డపై ఓడించినున్నట్లు చెప్పాడు. అయితే ఐపీఎల్ 2023 సమయంలో అతను ఈ కామెంట్ చేశాడు. మే నెలలో ఢిల్లీ క్యాపిటల్స్ పాడ్కాస్ట్లో అతని ఈ విషయాన్ని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా ఆ ఫైనల్లో రెండు వికెట్ల నష్టానికి 450 రన్స్ చేసిందని, ఇక చేజింగ్లో ఇండియా కేవలం 65 రన్స్కే ఆలౌట్ అవుతుందని మార్ష్ తెలిపాడు. ఐపీఎల్ సమయంలో మార్ష్ చేసిన ప్రిడిక్షన్కు చెందిన కొన్ని ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
MITCHELL MARSH SAYS,
AUSTRALIA WILL STAY UNDEFEATED IN THE ODI WORLD CUP 2023, DEFEATING INDIA IN THE FINAL. AUSTRALIA 450/2 IN THE FINAL, INDIA ALL OUT 65. pic.twitter.com/YmvJ8iMssh— Cricket Mantri (@VineethNagarjun) May 15, 2023