ఢిల్లీ: భారత స్టార్ వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను వచ్చే నెల అహ్మదాబాద్లో జరగాల్సి ఉన్న ఆసియా వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్స్ నుంచి తప్పుకోనుంది. భుజం గాయం కారణంగా ఆమె ఈ టోర్నీ నుంచి వైదొలగనున్నట్టు సమాచారం. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన నేషనల్ చాంపియన్షిప్స్ సందర్భంగా ఆమె భుజానికి గాయమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నది. రాబోయే జులైలో ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్, ఆ వెంటనే ఆసియా క్రీడలున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలో భాగంగానే చాను అహ్మదాబాద్ ఈవెంట్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తున్నది. చాను స్థానంలో భారత్ తరఫున కోమల్ కొహర్ బరిలోకి దిగనుంది.