మహబూబ్నగర్ టౌన్: రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తున్నదని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో క్రీడా ప్రాంగణాల నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ సహా ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్కు చెందిన 15 మంది జూన్ 29 నుంచి జూలై 1 వరకు అమెరికాలో జరుగనున్న ప్రపంచ కరాటే టోర్నీకి ఎంపికయ్యారు.
ఇందులో భాగంగా థాయ్లాండ్, మలేషియాలో వారం పాటు జరిగే సన్నాహక శిబిరానికి వెళ్తున్న 18 మంది కరాటే బృంద సభ్యులను క్యాంప్ కార్యాలయంలో మంత్రి అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా పతకాలతో సత్తాచాటాలంటూ ప్లేయర్లకు మంత్రి సూచించారు.