హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన 34వ సీనియర్ జాతీయ బేస్బాల్ చాంపియన్షిప్లో విజేతగా నిలిచిన తెలంగాణ జట్టును రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు. మంగళవారం రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో ప్లేయర్లు, కోచ్లు, అసోసియేషన్ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, భారత అమెచ్యూర్ బేస్బాల్ ఫెడరేషన్(ఏబీఎఫ్ఐ) సెక్రెటరీ జనరల్ హరీశ్, సంయుక్త కార్యదర్శి శ్వేత, రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి శోభన్, కోశాధికారి కృష్ణ, కోచ్లు శ్రీకాంత్, మొగిలి, కృష్ణ, సాయికుమార్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.