హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ టోర్నీని అందరూ విజయవంతం చేయాలని క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఇప్పటికే మండల స్థాయిలో పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయని అన్నారు. మండల స్థాయిలో జరుగుతున్న క్రీడాటోర్నీల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ నెల 22 నుంచి జిల్లా స్థాయిలో మొదలయ్యే పోటీలకు సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు విజయవంతం చేయాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, సాట్స్ డిప్యూటీ డైరెక్టర్ దీపక్ పాల్గొన్నారు.