Michaung Cyclone: చెన్నైని ముంచెత్తుతున్న మిచౌంగ్ తుఫాను కారణంగా తమిళనాడు రాజధాని అతలాకుతలమవుతోంది. చెన్నైకి చెందిన పలువురు క్రికెటర్లు దీనిపై ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలోనే ఉన్న టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ తాము ఉంటున్న ఏరియాలో కూడా సుమారు 30 గంటలకు పైగా పవర్ లేదని ట్వీట్ చేశాడు. తమతో పాటు చాలా ఏరియాలలో ఇదే పరిస్థితి నెలకొందని ట్వీట్ లో పేర్కొన్నాడు.
ట్విటర్లో ఓ నెటిజన్ తమ బంధువు అపార్ట్మెంట్లోని గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా మునిగిపోయి కార్లు తేలియాడుతున్న ఫోటోను షేర్ చేస్తూ ‘వెలాచెర్రిలోని నా సోదరి ఉంటున్న అపార్ట్మెంట్లో పరిస్థితి ఇది. వాళ్లకు గడిచిన రెండు రోజులుగా కరెంట్ లేదు. ఈ నగరంలో కరెంట్ పునరుద్ధరణ ఎప్పుడవుతుందో ఎవరైనా చెబుతారా..?’అని ట్వీట్ చేశారు.
No power in my locality for
more than 30 hours too. Guess thats the case in many places.Not Sure what options we have 🙏#ChennaiFloods https://t.co/gWArpwH3KI
— Ashwin 🇮🇳 (@ashwinravi99) December 5, 2023
ఈ ట్వీట్ను అశ్విన్ రీట్వీట్ చేస్తూ.. ‘మా ఏరియాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ కూడా 30 గంటలకు పైగా పవర్ లేదు. మిగతా ప్రాంతాలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. మనకు ఏం ఆప్షన్స్ ఉన్నాయో తెలియడం లేదు..’ అని పేర్కొన్నాడు.