ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (1), దేవదత్ పడిక్కల్ (7) నిరాశపరిచినా కూడా.. మరో స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ (89 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతనికి కెప్టెన్ సంజూ శాంసన్ (30) జత కలవడంతో రాజస్థాన్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది.
వీళ్లిద్దరూ అవకాశం దొరికిన ప్రతిసారీ బౌండరీలు బాదుతూ ముంబై బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. అయితే 15వ ఓవర్లో బంతి అందుకున్న ముంబై స్టార్ ప్లేయర్ కీరన్ పొలార్డ్.. శాంసన్ను పెవిలియన్ చేర్చాడు. పొలార్డ్ వేసిన స్లో బాల్ను అంచనా వేయడంలో విఫలమైన శాంసన్..
దాన్ని మిడ్ వికెట్ దిశగా గాల్లోకి లేపాడు. వేగంగా అక్కడకు చేరుకున్న తిలక్ వర్మ క్యాచ్ అందుకోవడంతో శాంసన్ పెవిలియన్ చేరాడు. దీంతో 15 ఓవరల్లో రాజస్థాన్ జట్టు 138/3 స్కోరుతో నిలిచింది.