వెస్టిండీస్ ఆల్రౌండర్, ముంబై ఇండియన్స్ ఆటగాడు కీరన్ పోలార్డ్ ఈ రోజు ఐపీఎల్కి గుడ్ బై చెప్పాడు. దాంతో 13 సీజన్లు తమ జట్టుతో కొనసాగిన పోలార్డ్కు ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ వెరైటీగా ధన్యవాదాలు తెలియజేసింది. తమ జట్టు సోషల్మీడియా ఖాతాలకు కీరన్ పోలార్డ్ ఫొటోని ప్రొఫైల్ ఫొటోగా పెట్టింది. ఆ ఫొటో కింద ఎప్పటికీ ముంబై ఇండియన్స్తోనే అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో ఆన్లైన్లో వైరల్ అవుతుంది.
ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన పోలార్డ్ ఇకపై ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్గా కొత్త బాధ్యతలు తీసుకోనున్నాడు. ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీని గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది. వెస్టిండీస్ ఆల్రౌండర్ తన విధ్వంసక బ్యాటింగ్తో ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 13 సీజన్లలో 3,412 పరుగు చేశాడు. 69 వికెట్లు తీశాడు. అయితే, పోయిన ఏడాది సీజన్లో పోలార్డ్ ఘోరంగా విఫలమయ్యాడు. 144 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో, ఈ సీజన్లో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. ముంబై ఇండియన్స్కు ప్రత్యర్థిగా వేరే జట్టు తరఫున ఆడడం ఇష్టంలేక ఐపీఎల్కు గుడ్ బై చెప్తున్నాను అని పోలార్డ్ అన్నాడు.
Always. Forever. Till Infinity ♾ 💙#MumbaiIndians #OneFamily @KieronPollard55 pic.twitter.com/qx3hllvwDY
— Mumbai Indians (@mipaltan) November 15, 2022