గాలె: వరుణుడి అంతరాయాల మధ్య సాగుతున్న వెస్టిండీస్, శ్రీలంక రెండో టెస్టు రసవత్తరంగా మారింది. ఓవర్నైట్ స్కోరు 69/1తో బుధవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ 253 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బ్రాత్వైట్ (72) అర్ధశతకం సాధించగా.. మయేర్స్ (36), బూనర్ (35) ఫర్వాలేదనిపించారు. లంక బౌలర్లలో ఆఫ్ స్పిన్నర్ రమేశ్ మెండిస్ ఆరు వికెట్లతో అదరగొట్టాడు. ప్రవీణ్, ఎంబుల్దెనియా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక బుధవారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 46 పరుగులు చేసింది. దిముత్ కరుణరత్నె (6), ఒశాడా ఫెర్నాండో (14) రనౌట్ల రూపంలో వెనుదిరగగా.. నిషాంక (21), అసలంక (4) క్రీజులో ఉన్నారు. చేతిలో 8 వికెట్లు ఉన్న లంక.. విండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 3 పరుగులు వెనుకబడి ఉంది.