న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్ నియోజకవర్గంలో ఇవాళ లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఆ నియోజకవర్గంలోని బిజెమరా పట్టణంలో అక్కడ తమ పార్టీకి చెందిన కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ(Mehbooba Mufti) ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆమె రోడ్డుపై ధర్నా చేశారు. పీడీపీ పోలింగ్ ఏజెంట్లను టార్గెట్ చేసి అరెస్టు చేస్తున్నారని, మేం కారణం అడిగినా వాళ్లేమీ చెప్పడం లేదని ఆమె ఆరోపించారు. తనను పార్లమెంట్కు వెళ్లనివ్వకుండా అధికార ప్రభుత్వం అడ్డుకుంటోందన్నారు. పార్టీ కార్యకర్తలు, వర్కర్లతో ఆమె నిరసన ప్రదర్శలో పాల్గొన్నారు.