హైదరాబాద్: జగన్మోహన్రావు స్మారక రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీలో మెదక్ విజేతగా నిలిచింది. మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎమ్ఎల్ఆర్ఐటీ) కాలేజీ వేదికగా బుధవారం జరిగిన ఫైనల్లో మెదక్ 3 వికెట్ల తేడాతో మహబూబ్నగర్పై గెలిచింది. ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
విజేత మెదక్కు లక్ష రూపాయలతో పాటు ట్రోఫీ, రన్నరప్ మహబూబ్నగర్కు రూ.75 వేల నగదు అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాంగణాలను నిర్మిస్తుందని తెలిపారు. ప్రతిభ కల్గిన ప్లేయరక్లు ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహకారం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్ఎల్ఆర్ఐటీ కార్యదర్శి మర్రి రాజశేఖర్రెడ్డి, కరీంనగర్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు ఆగంరావు, మురళీధర్రావు పాల్గొన్నారు.